ఎనిమిదో రోజు కూడా.....!

Telugu Lo Computer
0


దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈరోజు కూడా మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. నేడు పెట్రోల్ ధర 80 పైసలు పెరిగింది. గత 9 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా 8 సార్లు పెరిగాయి. పెరిగిన ధరలతో తెలంగాణలో పెట్రోల్ పై 91 పైసలు పెరగగా, డీజిల్ పై 87 పైసలు పెరిగింది. మొత్తంగా పెరిగిన ధరలతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.114.50కు చేరగా.. డీజిల్ రూ.100.69కి చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో 137 రోజులు పెట్రోలు, డీజిల్‌ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయంగా బ్యారెల్ ధర నవంబరులో 82 డాలర్లుగా ఉండగా.. మార్చి ఆరంభంలో 111 డాలర్లకు చేరింది. ఉక్రెయిన్‌, రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఓ సమయంలో బ్యారెల్‌ ధర 139 డాలర్లకు కూడా చేరింది. అయినా 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల్లో మార్పులు చేయలేదు. ఎన్నికల అనంతరం గత వారం నుంచి బాదుడు మొదలవగా నిపుణుల అంచనా ప్రకారం ధరలు రూ.120-125 వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)