విండీస్ పై భారత్ ఘన విజయం

Telugu Lo Computer
0


మహిళా వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా సిడన్ పార్క్‌లో జరిగిన మ్యాచ్ లో వెస్టింండీస్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. టీమిండియా విధించిన 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ శుభారంభం దక్కింది. ఓపెనర్లు డియాండ్రా డట్టిన్ (62), మ్యాథ్యూస్ (43)లు ఇద్దరూ జట్టుకు వంద పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే, మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమవ్వడంతో విండీస్ జట్టు 162 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు బ్యాటింగ్ చేపట్టించిన టీమిండియా ఓపెనర్ స్మృతి మంధనా (123), హర్మన్ ప్రీత్ కౌర్ (109)లు సెంచరీలతో చెలరేగడంతో 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)