ఔషధంగా ఇచ్చే లిక్కర్ సీసాలపై హెచ్చరికలు సాధ్యపడదు!

Telugu Lo Computer
0


సిగరెట్ ప్యాకెట్లపై ఉపయోగించే హెచ్చరిక గుర్తు మాదిరిగానే మద్యం సీసాలు ప్యాకేజీలపై ‘ఆరోగ్య హెచ్చరిక’ను ప్రచురించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కానీ దీనిపై నోటీసు ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. ఢిల్లీలో మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు నిషేధించాలని లేదంటే కనీసం వాటిని నియంత్రించేందుకు ఆదేశాలు జారీ చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. సిగరెట్ బాక్సులపై ముద్రించినట్టుగానే లిక్కర్ సీసాలపైనా హెచ్చరికలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ కోర్టును కోరారు. ఔషధంగా ఇచ్చే లిక్కర్ సీసాలపై హెచ్చరికలు ముద్రించడం సాధ్యపడదని ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటానికి ధర్మాసనం తిరస్కరించింది. ఈ విషయంలో ఏం చేయగలమన్నది తదుపరి విచారణ సందర్భంగా పరిశీలిస్తామంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన ధర్మాసనం జూలై 4కు వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)