ఉత్తర్ప్రదేశ్ లోని పిలిభిత్లోని ఓ కుటుంబం నాలుగు నెలల క్రితం వారి కుమార్తెకు వివాహం చేశారు. పెళ్లయ్యాక అత్తమామలు తమ కోడలికి ఘనంగా స్వాగతం పలికారు. సొంత కూతురులా చూసుకున్నారు. తమను కూడా బాగా చూసుకుంటుందని భావించారు. కానీ, కొద్ది రోజుల్లోనే ఊహించని షాక్ ఇచ్చింది ఆ కోడలు. పెళ్లైన నాలుగు నెలల వరకు బాగానే ఉంది. ఈ క్రమంలోనే మార్చి 1వ తేదీన సదరు మహిళ తన కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రం సందర్శనకు వెళ్లింది. ఇదే అవకాశంగా భావించిన ఆమె అక్కడి నుంచి పారిపోయింది. కోడలు ఉన్నపళంగా కనిపించకుండా పోవడంతో అత్తమామలు, భర్త కంగారు పడ్డారు. ఎక్కడికి వెళ్లిందో అని వారి పుట్టింటికి ఫోన్ చేసి ఆరా తీశారు. అక్కడికి కూడా రాలేదని చెప్పడంతో మరింత కంగారు పడ్డారు. ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ కోసం అటు పుట్టింటి వారు, ఇటు మెట్టినింటివారు తీవ్రంగా గాలించారు. చివరకు మహిళ సొంత మేనమామ ఇంట్లో చూడగా అక్కడ కనిపించి షాక్ ఇచ్చింది. అక్కడి నుంచి ఆమెను ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా వచ్చేందుకు నిరాకరించింది. అతనే తన సర్వస్వం అని, అతనితోనే జీవితం పంచుకుంటానంటూ తేల్చి చెప్పింది. దాంతో ఈ వ్యవహారం పోలీసు స్టేషన్ గడప తొక్కింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post Top Ad
adg
Friday, 4 March 2022
Home
Criem
ఉత్తర్ప్రదేశ్ లోని పిలిభిత్
కోడలు ఉన్నపళంగా కనిపించకుండా పోవడం
పెళ్లైన 4 నెలలకి యువతి పరార్!
పెళ్లైన 4 నెలలకి యువతి పరార్!
పెళ్లైన 4 నెలలకి యువతి పరార్!
Tags
# Criem
# ఉత్తర్ప్రదేశ్ లోని పిలిభిత్
# కోడలు ఉన్నపళంగా కనిపించకుండా పోవడం
# పెళ్లైన 4 నెలలకి యువతి పరార్!
About Telugu Post
పెళ్లైన 4 నెలలకి యువతి పరార్!
Tags
Criem,
ఉత్తర్ప్రదేశ్ లోని పిలిభిత్,
కోడలు ఉన్నపళంగా కనిపించకుండా పోవడం,
పెళ్లైన 4 నెలలకి యువతి పరార్!
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment