250 కిలోమీటర్లు ప్రయాణిస్తే సిటీ బస్సుల్లో ఫ్రీ

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నగరం నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల నుంచి 250 కిలోమీటర్లకు పైగా దూరాలకు ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు 2 గంటలు, తర్వాత 2 గంటల పాటు ఈ సదుపాయం వర్తిస్తుందని తెలిపారు. ముందస్తు రిజర్వేషన్‌ టికెట్‌ చూపించి సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)