దేశంలో గత 24 గంటల్లో భారత్ లో 2 వేల 876 కేసులు నమోదు కాగా, 3 వేల 884 మంది ఒక్క రోజులో కోలుకున్నారని, 98 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 3 వేల 811 యాక్టివ్ కేసులుండగా మొత్తం వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,50,055 చేరుకుంది. కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 5,16,072గా ఉంది. 1,80,60,93,107 మంది టీకాలు వేసినట్లు వెల్లడించింది. 78.05 కోట్ల మందికి టెస్టులు నిర్వహించడం జరిగిందని, గత 24 గంటల్లో 7,52,818 మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోతున్నట్లు కనిపిస్తోంది.
దేశంలో 24 గంటల్లో 2 వేల 876 కేసులు నమోదు
March 16, 2022
0