వెహికిల్స్ పై ప్రెస్ స్టిక్కర్ వేస్తే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూ.1000 ఫైన్ వేస్తున్నారు. బండ్ల మీద నకిలీ స్టిక్కర్లు అతికించుకుని తిరిగే వాళ్లకు ఫైన్ వేయాలి కానీ నిజమైన జర్నలిస్టులకు వేస్తున్నారు. ప్రెస్ స్టిక్కర్లు కనిపిస్తే.. రూ.700 కట్టాల్సిందేనని వార్నింగ్ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అక్రిడేషన్ కార్డును చూపించినా వినడం లేదు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న ఓ ప్రముఖ జర్నలిస్టుకు పోలీసులు ఫైన్ వేశారు. ఆయన అన్ని ఫ్రూప్స్ చూపించినా వినకుండా ఫైన్ వేశారు. ఈ కొత్త రూల్స్ నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని పాత్రకేయ లోకం కోరుతోంది.
ప్రెస్ స్టిక్కర్ వేస్తే రూ.1000 జరిమానా
March 30, 2022
0
Tags