డీకే అరుణ కూతురిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు

Telugu Lo Computer
0


భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి డీకే అరుణకు ఊహించని షాక్‌ తగిలింది. బీజేపీ పార్టీ నేత డీకే అరుణ కూతురుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. కోర్టు ఆదేశాల మేరకు డీకే అరుణ కూతరు శృతి రెడ్దీ, వినోదలపై కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు. ఎలీషాబాబు ఫిర్యాదు మేరకు IPC 323, 336, 341, 384, 448, 506 R/W 34…..SC ST POA Act కి 3(C) ,3(r) , 3(s) సెక్షన్ల కింద బంజారాహిల్స్‌ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. బంజారా హిల్స్ లోని పివిపి ఇంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం పనులు చేస్తున్న తమపై శృతి రెడ్ది దూషించిందని ఫిర్యాదులో ఎలీషా బాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు పక్కా ఆధారాలు ఎలీషా బాబు సమర్పించారు. ఇక ఆ ఆధారాలను పరిశీలించిన బంజారా హిల్స్ పోలీసులు.. డీకే అరుణ కూతురిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)