ఒకే ఇంట్లో ఇద్దరు యువతుల సహ జీవనం ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇద్దరు యువతులు సహజీవనం చేయడం ఇక ఒకరిపై ఒకరు ప్రేమతో పెళ్లి చేసుకోవడం వివాదాస్పదంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ విషయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ యువతి తల్లి వీరి వ్యవహారం గురించి ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతులను ఈ విషయంపై వివరణ కోరారు.  తమ మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటూ చెబుతున్నారు ఇద్దరు యువతులు. మేమిద్దరం కేవలం అక్కాచెల్లెళ్ల లాగా కలిసిమెలిసి జీవిస్తున్నాము అంటూ చెబుతున్నారు. రమ్యకు ఆమె తల్లి ఇష్టం లేని పెళ్లి చేసేందుకు సిద్ధమైంది. అందుకే రమ్య ఇంటి నుంచి బయటకు వచ్చి తన వద్ద ఉంటుంది అని చెప్పుకొచ్చింది సుమలత. తామిద్దరం పెళ్లి చేసుకున్నట్లుగా టిక్ టాక్ లో వీడియోలు కలిసి చేశామని, అది నిజమైన పెళ్లి కాదు అంటూ సుమలత రమ్య పోలీసులకు చెబుతున్నారు. అటు సుమలత నివాసంలో పని చేసే ఆయా మాత్రం ఇద్దరు యువతులు నిజంగానే పెళ్లి చేసుకున్నారు. విషయం బయటకు చెబితే ఇంటి పనుల్లో తొలగిస్తారని బెదిరించారని అందుకే ఇప్పుడు వరకు ఎవరికీ ఈ విషయం చెప్పలేదు అంటూ ఇంట్లో పని చేసే ఆయా చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Post a Comment

0Comments

Post a Comment (0)