రాజస్థాన్లోని ధోలాపూర్కు చెందిన ఘనశ్యామ్ చాహర్.. తన పక్కింట్లో ఉండే యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం వల్ల ఆమెతో సన్నితంగా మెలిగేవాడు. ఈ క్రమంలో యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం యువతి ఎవరికీ చెప్పకపోవడాన్ని ఆ యువకుడు అవకాశంగా మలుచుకున్నాడు. దీనిని అలుసుగా తీసుకున్న ఘనశ్యామ్.. ఈ నెల 18న మరోసారి యువతిపై అత్యాచారం చేశాడు. ఈ సారి ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు తీవ్ర ఆగ్రహంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు తన కోసం వెతుకుతున్నారన్న విషయం తెలుసుకున్న యువకుడు పరారయ్యాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
యువతిపై అత్యాచారం
February 20, 2022
0