టెస్టులు కీలకం : ప్రపంచ ఆరోగ్య సంస్థ

Telugu Lo Computer
0


కరోనాతో మరింత ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకురావడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వారం రోజుల్లో 70వేల కరోనా మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ చెప్పారు. ఆఫ్రికాలో 83శాతం జనాభాకు కోవిడ్ టీకాలు అందలేదని పేర్కొన్నారు. అయితే మనం కలిసికట్టుగా ఉంటే దీన్ని అంతం చేయొచ్చని వెల్లడించారు. అంతేకాదు కరోనా కేసులు తగ్గుతున్నాయని టెస్టులను తగ్గించడం ఏ మాత్రం మంచిది కాదని ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వైరస్ ను కట్టడి చేయడానికి, కొత్త వేరియంట్లు గుర్తించేందుకు.. ప్రాణ నష్టం తగ్గించేందుకు టెస్టులు కీలకమని తెలిపింది. వేగంగా.. ఖచ్చితమైన ఫలితాలను చూపించే కిట్ లను వాడాలని పేర్కొంది. వ్యాక్సినేషన్ శాతాన్ని పెంచాలని సూచించింది. మరోవైపు మన దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతుంది. ఇప్పటిదాకా 2కోట్ల మంది 15 నుండి 18 ఏళ్ల మధ్య వయస్సుగల యువతకు రెండో డోస్ వ్యాక్సిన్ పూర్తి అయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మన దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి కానీ భవిష్యత్తులో మరింత ప్రమాదకరమైన వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశముందని ప్రపంచఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)