ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు...!

Telugu Lo Computer
0


మోహన్ బాబు మెయిన్ లీడ్ గా 'సన్ ఆఫ్ ఇండియా' అనే సినిమాని చేశారు. ఈ సినిమాని డైమండ్ రత్నబాబు తెరకెక్కించగా మంచు విష్ణు నిర్మించారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా ఫిబ్రవరి 18న రిలీజ్ అవ్వనుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఇటీవల మంచు విష్ణు, మోహన్ బాబు అనేక సందర్భాలలో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. వాటిని మీమ్స్, ట్రోల్స్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. తాజాగా వీటిపై మోహన్ బాబు స్పందించారు. మోహన్ బాబు ఈ ట్రోల్స్, మీమ్స్ మీద స్పందిస్తూ.. ”ట్రోల్స్, మీమ్స్ అనేవి సరదాగా నవ్వుకునేలా ఉండాలే తప్ప, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సాధారణంగా నేను ట్రోలింగ్స్‌, మీమ్స్‌ను పట్టించుకోను. ఎవరైనా నాకు పంపినప్పుడే చూస్తాను. ట్రోలింగ్‌ను పట్టించుకోకూడదు. కానీ ఇటీవల ఇవి హద్దులు మీరుతున్నాయి. అలాంటి వాటిని చూసినప్పుడు బాధగా ఉంటుంది. ఎదుటి వారిని ట్రోలింగ్ చేయొచ్చేమో నాకు తెలియదు కానీ వ్యగ్యంగా ట్రోల్ చేయడం అనేది బాధాకరంగా ఉంటుంది.” అని అన్నారు. ”నా మీద ఇద్దరు హీరోలు ట్రోలింగ్ చేయిస్తున్నారు. ఇద్దరు హీరోలు యాబై నుంచి వంద మందిని ట్రోలింగ్ చేయడానికే నియమించుకుని నన్ను ట్రోల్ చేయిస్తున్నారు. వాళ్లెవరో కూడా నాకు తెలుసు. వారిని ప్రకృతి గమనిస్తోంది. వారికి ఇప్పుడు బాగానే ఉంటుంది. కానీ ఏదో ఒక రోజు శిక్ష అనుభవిస్తారు. అప్పుడు వారి వెనుక ఎవరూ ఉండరు. ఎవరూ సహాయపడరు'' అని ఈ విషయంపై సీరియస్ గానే స్పందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)