బాలికను చంపిన తల్లి, తాత

Telugu Lo Computer
0


తెలంగాంలోని ఖమ్మం జిల్లా బోనకల్ కు చెందిన న పాలెపు హరికృష్ణ, సునీత దంపతులకు ఇద్దరు కూతుళ్లున్నారు. హరికృష్ణ లారీ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను తరచూ పని నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఈ క్రమంలో సునీతకు తన భర్త తండ్రి నర్సింహారావుతో అక్రమ సంబంధం ఏర్పడింది.  ఇటీవల తల్లి, తాత ఒకే గదిలో  ఉండగా సునీత పెద్ద కుమార్తె మహాదేవి (11) చూసింది. ఒక్కసారిగా షాకైన ఆ చిన్నారి తల్లి, తాతలను నిలదీసి, ఈ విషయం తండ్రికి చెబుతానని అనడంతో బెదిరిపోయిన సునీత, నర్సింహారావులు బాలికను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 8న మహాదేవి కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడ బిగించి హతమార్చారు. తన కూతురు ఫిట్స్‌తో స్కూల్లో మృతి చెందినట్లు సునీత అందరినీ నమ్మించింది. అయితే, పాపమెడపై ఉన్న కమిలిన గాయాలను బంధువులు గమనించి పోలీసులకు చెప్పడంతో వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. బాలిక మహాదేవి హత్యకు గురైనట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో తేలడంతో పోలీసులు బాలిక తల్లి, తాతను అదుపులోకి తీసుకుని విచారించారు. చివరికి మహాదేవిని తామే హత్య చేసినట్లు సునీత, నర్సింహారావు అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలియజేశారు. రికార్డు సమయంలో కేసును త్వరగా ఛేదించిన మధిర సీఐ మురళి, ఎస్‌ఐ కవిత, సిబ్బంది నాగేశ్వరరావు, సత్యంబాబు, శాంత్‌కుమార్‌ను ఏసీపీ స్నేహా మెహ్రా అభినందించారు. దర్యాప్తు చేసిన పోలీస్ బృందానికి క్యాష్‌ రివార్డు కూడా అందజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)