టైర్‌ పేలి బస్సు బోల్తా, ఇద్దరి మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని మెదక్‌ జిల్లాలో టైర్‌ పేలి ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తాపడటంతో ఇద్దరు మృతి చెందగా 20 మందికి గాయాలయ్యాయి. బస్సులో ఉన్న 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అజితా బేగం, దహిగా బేగంగా గుర్తించారు. వీరిద్దరు తల్లీకూతుళ్లుగా నిర్ధారించారు. బస్సులోని వారంతా హైదరాబాద్‌లోని షాద్‌గర్ చెందిన వాసులుగా గుర్తించారు. గాయపడ్డ వారిని మెదక్‌లోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో బస్సుని రోడ్డు పక్కకి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)