ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న కారు వెనుక నుంచి లారీని డీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా తెలుస్తోంది. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని లారి వెనుక భాగంలో ఇరుక్కుపోయిన కారును బయటకు లాగారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఘోరరోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం
فبراير 18, 2022
0
Tags