అనుమానాస్పద స్థితిలో ఖాదీస్టోర్‌ ఓనర్ మృతి

Telugu Lo Computer
0


అనుమానాస్పద స్థితిలో ఖాదీ స్టోర్‌ ఓనర్ మృతి చెందిన ఘటన మంగళవారం నారాయణగూడ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బి.గట్టుమల్లు కథనం ప్రకారం అవంతీనగర్‌లోని ఎస్‌వీ మినాశ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే అంబాల ప్రకాశ్‌ వీర్‌ (52) హైదర్‌గూడలో భారత్‌ ఖాదీ స్టోర్‌ నడుపుతున్నాడు. మంగళవారం రాత్రి ఇంట్లో చిన్నపాటి గొడవ చోటు చేసుకోవడంతో ప్రకాశ్‌ వీర్‌ అతని బెడ్‌రూంలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు. తలుపులు తీయకపోవడంతో భార్య ఐశ్వర్య అతడి సోదరుడిని పిలిపించి తలుపులు తీయించగా తీవ్ర రక్తస్రావంలో ప్రకాశ్‌వీర్‌ కనిపించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గట్టుమల్లు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)