త్వరలో పెన్షన్ బకాయిలు విడుదల

Telugu Lo Computer
0


తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు సిసిఎస్ తో పాటు ఇతర బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రకటన చేశారు. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆర్టీసీ అభివృద్ధిపై జూమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో సమర్థవంతంగా పని చేసిన ఉద్యోగులకు మంచి గుర్తింపు ఉంటుందని ప్రకటన చేశారు. విధి నిర్వహణను మరి భారంగా భావించవద్దని అంకితభావంతో పనిచేయాలని కోరారు సజ్జనర్. బాధ్యతలు నిర్వహించే సమయంలో ఒత్తిడిని అధిగమించాలి అలాగే సవాళ్ళను ఎదుర్కోవాల్సి అని ఆర్టిసి ఎండి సజ్జన సిబ్బందికి సూచనలు చేశారు. ఆర్టీసీని లాభాల్లో తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరిస్తామని కల్పించారు. ఆర్టీసీ ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)