మహిళా కానిస్టేబుల్‌ హత్య

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ జిల్లా కు చెందిన రుచిసింగ్  లక్నోలో పని చేస్తోంది. అంతకు ముందు ఆమె బారాబంది జిల్లాలోని అసంద్ర పోలీసు స్టేషన్ లో పని చేశారు. అర్జన్ గంజ్ ప్రాంతంలో ఆమె అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఫిబ్రవరి 13 నుంచి ఆమె విధులకు హాజరు కావటంలేదు. కాగా ఈనెల21న ఆమె మృతదేహం కాలువలో లభించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా ఆమె వివాహేతర సంబంధం బయట పడింది. పోలీసులు తహసిల్దార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆయన నేరం ఒప్పుకున్నారు. రుచి సింగ్ తో వివాహేతర సంబంధం ఉందని ఇటీవలి కాలంలో ఆమె తనను వివాహం చేసుకోమని ఒత్తిడి చేస్తోందని అందుకే ఆమెను హత్య చేసినట్లు తహసిల్దార్ నేరం ఒప్పుకున్నారు. రుచిసింగ్ ను హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు తెలిపారు. ఈ కేసులో తహసిల్దార్ తో పాటు ఆయన భార్యను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అదనపు డీసీపీ ఖాసిం అబ్ధి తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)