సీబీడీసీ (సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ)ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో సీబీడీసీ కింద డిజిటల్ రూపాయి ప్రారంభించనుంది. ఇది బ్లాక్చెయిన్ టెక్నాలజీ ద్వారా మద్దతు ఇవ్వబడే క్రిప్టో కరెన్సీని సీబీడీసీ జారీ చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నది. సీబీడీసీ అనేది డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన చట్టపరమైన టెండర్. ఇది కాగితంలో జారీ చేయబడిన ఫియట్ కరెన్సీని పోలి ఉంటుంది. ఏదైనా ఇతర ఫియట్ కరెన్సీతో పరస్పరం మార్చుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. ఇన్వెస్టోపీడియా ప్రకారం, వినియోగదారులకు డిజిటల్ సౌలభ్యం మరియు భద్రతతో పాటు సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థ యొక్క నియంత్రిత, రిజర్వ్-బ్యాక్డ్ సర్క్యులేషన్ను ప్రభుత్వం అందించాలి అనుకుంటే ఇది అవసరం. క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం నియంత్రిస్తూ దేశంలో చలామణి చేయించాలి అనుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఇది అవసరం. బడ్జెట్లో వచ్చిన డిజిటల్ రూపీ జారీ ప్రకటన తప్పనిసరిగా క్రిప్టోకరెన్సీ, ఇతర వర్చువల్ కరెన్సీలపై ప్రభుత్వ ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తుంది. బిట్కాయిన్, ఈథర్ వంటి ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలతో మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్, పన్ను ఎగవేత మొదలైన వాటి గురించి రిజర్వ్ బ్యాంక్ అనేక సందర్భాల్లో మాట్లాడింది. ఈ విషయంలో ప్రభుత్వం స్వంత సీబీడీసీ ని ప్రకటించాలని ప్రణాళిక వేసుకుని దీన్ని నియంత్రించాలి అనుకుంటున్నది ఆ మేరకు ఈ ప్రకటన చేసింది. డిజిటల్ రూపాయితో ఎలా లావాదేవీలు జరపవచ్చనే దానిపై సాంకేతిక నిపుణులు ఇంతవరకు మాట్లాడుతూ వున్నారు. ఇప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారిక ప్రకటన తర్వాత పౌరులు డిజిటల్ రూపాయితో ఎలా లావాదేవీలు జరపాలి అనే చర్చ చేస్తారు. ఒక ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ప్రస్తుత డిజిటల్ చెల్లింపు అనుభవానికి భిన్నమైన డిజిటల్ రూపాయి లావాదేవీలు సామాన్య ప్రజల్లో పాపులర్ అవుతుంది.
డిజిటల్ రూపాయి అంటే ఏమిటి..?
February 03, 2022
0
Tags