తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో సముద్ర తీరానికి కొట్టుకువచ్చిన ఓ పడవ మాత్రం.. మిస్టరీగా మారింది. ఆ పడవలో కనిపించినవి చూసిన మత్సకారులకు కాస్త వింతగా అనిపించింది. అల్లూరు మండలం ఇస్కపల్లి సముద్ర తీరానికి సదరు పడవ కట్టుకొచ్చింది. వెదురు బొంగులతో ఆ పడవ నిర్మాణం చేశారు. పడవ కొత్తగా ఉండటంతో స్ధానిక మత్స్యకారులు దగ్గరకు వెళ్లి పరిశీలించారు. ఈ పడవ లోపల బుద్దుడు విగ్రహం, శివలింగం ఉండటాన్ని గుర్తించారు. వెంటనే మెరైన్ పోలీసులకు ఫోన్ చేసి వివరాలు చెప్పారు. మత్సకారుల సమాచారంతో ఇస్కపల్లి సముద్ర తీరానికి వచ్చిన మెరైన్ పోలీసులు ఆ పడవను స్వాధీనం చేసుకున్నారు. ఇది శ్రీలంకకు చెందిన పడవ అని మత్స్యకారులు అనుమానిస్తున్నారు. మెరైన్ పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. అలల ఉధృతి ఎక్కువై పడవ ఇలా తీరానికి కొట్టుకుని వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ పడవ విషయం చుట్టుపక్కల ప్రాంతాల జనాలకు తెలియడంతో అక్కడికి వచ్చి ఈ కొత్తరకం పడవను ఆసక్తిగా చూసి వెళుతున్నారు. గతంలో కూడా ఇలా పడవలు కొట్టుకువచ్చిన దాఖలాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. విచారణలో పూర్తి విషయాలు వెల్లడవ్వనున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)