హైదరాబాద్ లో రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం

Telugu Lo Computer
0


మంచినీటి పైపులైన్లకు సంబంధించి లీకేజీల నివారణకు జలమండలి చేపడుతున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 23వ తేదీ బుధవారం ఉదయం ఐదు గంటల నుండి 24వ తేదీ గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు మొత్తం 36 గంటలపాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. నగరంలోని శాస్త్రిపురం, బండ్లగూడ, బోజగుట్ట, చింతల్ బస్తి, షేక్ పెట్, అల్లబండ, జూబ్లిహిల్స్, ఫిలింనగర్, ప్రశాసన్ నగర్, తట్టి ఖానా, లాలాపేట్, సాహెబ్ నగర్, ఆటోనగర్, సరూర్ నగర్, వాసవి రిజర్వాయర్ పరిసరాలు, సైనిక్పురి, మౌలాలి, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్, గచ్చిబౌలి, మాదాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, మధుబన్, దుర్గా నగర్, బుద్వేల్, సులేమాన్ నగర్, గోల్డెన్ హిట్స్, నైన్ నెంబర్, బోడుప్పల్, మల్లికార్జున్ నగర్, మాణిక్ చంద్, చెంగిచెర్ల, భరత్ నగర్, ఫిర్జాదిగూడ, ధర్మ సాయి తదితర ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)