ఢిల్లీలోని నిర్మాణ్ విహార్ మెట్రో స్టేషన్ లో ఓ 8 ఏళ్ల బాలికను సీఐఎస్ఎఫ్ జవాను కాపాడాడు. అక్కడి సమీపంలో ఉండే చిన్నారి ఆడుకుంటూ మెట్రో స్టేషన్ లో 25 ఫీట్ల ఎత్తులో ఉన్న ఫెన్సింగ్ దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత తిరిగి రావటం ఆమెకు కష్టమైంది. అక్కడ్నుంచి జారిపడితే ప్రాణాలు గాల్లో కలవడమే. పాప ఇబ్బందిని గమనించిన సీఐఎస్ఎఫ్ జవాన్ అప్రమత్తమై.పాపను కాపాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పాపను సురక్షితంగా తల్లితండ్రులకు అప్పగించారు. జవాన్ చేసిన మంచి పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
బాలికను కాపాడిన సీఐఎస్ఎఫ్ జవాన్
February 28, 2022
0
Tags