ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ ఆందోళన

Telugu Lo Computer
0


రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో ఏర్పడిన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భారత దేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారని, వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత దేశ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి తెలిపారు. విద్యార్థులు, ఇతర భారతీయులను తిరిగి భారత దేశానికి తీసుకెళ్ళేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని భారత్ కోరుతోందన్నారు. ప్రస్తుత పరిస్థితిని సరైన రీతిలో, చాలా జాగ్రత్తగా పరిష్కరించకపోతే, భారీ సంక్షోభంగా మారే ప్రమాదం ఉందన్నారు. భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉందని తెలిపారు. అన్ని వర్గాల భద్రతను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)