సిమెంట్ లారీ ఇంట్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో నడిమిచెర్లకు చెందిన పోకల సదా (29) రాయచోటికి వెళ్లి అతని యజమాని నుంచి ఎర్రగుంట్లకు లారీ తీసుకెళ్లాడు. అక్కడ సిమెంటు లోడుతో బెంగళూరుకు శుక్రవారం అర్ధరాత్రి బయలుదేరాడు. ఇదే గ్రామానికి చెందిన పి.నాగరాజ (35) రాయచోటిలో లారీ ఎక్కి అక్కడ నుంచి వాహనాన్ని నడిపాడు. కోన క్రాస్‌ వద్ద జేసీబీ డ్రైవర్‌ కుమార్‌ (20) వీరి లారీ ఎక్కాడు. విశ్రాంతి తీసుకోవడానికి నడించెర్లకు బయలుదేరగా నడిమికండ్రిగలోని మొదటి మలుపు వద్ద అదుపు తప్పి లారీ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో ఎవరూ నివసించడం లేదు. రాతిబండలు పడి సదా, నాగరాజు అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్సై హరిహర ప్రసాద్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)