గూగుల్ నుంచి రూ.65కోట్ల జాక్ పాట్ కొట్టేశాడు!

Telugu Lo Computer
0


భారత్‌కు చెందిన అమన్ పాండే ఎన్ఐటీ భోపాల్ లో పట్టభద్రుడయ్యాడు. అనంతరం ప్రముఖ కంపెనీలకు చెందిన సాఫ్ట్‌వేర్‌లలో లోపాల్ని గుర్తించేందుకు గతేడాది బగ్స్ మిర్రర్ పేరిట కంపెనీని స్థాపించాడు. ఈ నేపథ్యంలో గూగుల్ తమ సంస్థలకు చెందిన సాఫ్ట్‌వేర్‌లలో లోపాల్ని గుర్తించిన వారికి భారీ ఎత్తున ప్రోత్సాహకాల్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఇందుకోసం వల్నరబిలటీ రివార్డ్ ప్రోగ్రామ్ 2021 ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమన్ పాండే గూగుల్, ఆండ్రాయిండ్‌, గూగుల్ క్రోమ్‌, గూగుల్ ప్లేస్టోర్ తో పాటు ఇతర ప్రొడక్ట్‌లలో వందల సంఖ్యలో బగ్స్‌ను గుర్తించాడు. ఒక్క ఏడాదిలోనే గూగుల్ తో పాటు ఆ సంస్థకు చెందిన మిగిలిన కంపెనీలకు చెందిన పలు సాఫ్ట్‌వేర్‌లలో మొత్తం 232 లోపాల్ని గుర్తించాడు. ఈ నేపథ్యంలో అమన్‌ను గూగల్ ప్రత్యేకంగా అభినందించింది. బగ్స్ ను గుర్తించినందుకు రూ.65కోట్ల రివార్డ్‌ను అందిస్తున్నట్లు గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో ప్రధానంగా హైలెట్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)