రితేశ్ నుంచి విడిపోతున్నట్లు రాఖీ సావంత్ ప్రకటన చేసింది. బిగ్ బాగ్ రియాల్టీ షో తర్వాత చాలా పరిణామాలు జరిగాయని తెలిపింది. రాఖీ సావంత్ బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా పాల్గొంది. ” ప్రియమైన ఫ్యాన్స్, శ్రేయోభిలాషులకు నేను, రితేశ్ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. బిగ్ బాస్ షో తర్వాత చాలా సంఘటనలు జరిగాయి. వాటిలో కొన్ని నేను నియంత్రిచలేనివి. సమస్యలను పరిష్కరించుకునేందుకు నేను, రితేశ్ చాలా చర్చించాం. కానీ సాధ్య పడలేదు. అందుకే ఇకపై ఎవరి జీవితం వాళ్లదే అని నిర్ణయం తీసుకున్నాం. విడిపోయి చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము. ” అంటూ పోస్టు పెట్టింది.
విడాకులు తీసుకున్న రాఖీ సావంత్
February 14, 2022
0