ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. 30 కిలోలకు పైగా బరువు ఉండే కచ్చిడి మగ చేప చిక్కడంతో మత్స్యకారులు ఎగిరి గంతులేశారు. దాని కడుపులో ఉండే బ్లాడర్కు మంచి గిరాకీ ఉంటుంది. దీంతో ఈ చేపను కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. చివరకు ఈ చేప ఏకంగా రూ.4.30 లక్షలకు అమ్ముడుపోయింది. కాకినాడలో ఈ చేప ఇంత ధర పలకడం ఇదే తొలిసారని అక్కడి మత్స్యకారులు చెప్పారు. భారీ ధరకు ఆ చేప అమ్ముడుపోయినందుకు ఆనందం వ్యక్తం చేశారు.
కచ్చిడి చేప ధర రూ.4.30 లక్షలు !
February 06, 2022
0