టీ20లో విండీస్‌పై భారత్‌ విజయం

Telugu Lo Computer
0


బుధవారం జరిగిన తొలి టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. అరంగేట్రం స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ (2/17)తోపాటు మిగతా బౌలర్లూ రాణించడంతో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 157/7 స్కోరు చేసింది. నికోలస్‌ పూరన్‌ (43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 61) అర్ధ శతకం సాధించాడు. హర్షల్‌ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 18.5 ఓవర్లలో 162/4 స్కోరు చేసి నెగ్గింది. సూర్యకుమార్‌ (18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (35) సత్తా చాటారు. చేజ్‌ రెండు వికెట్లు దక్కించుకొన్నాడు. బిష్ణోయ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది.

Post a Comment

0Comments

Post a Comment (0)