ఆంధ్రప్రదేశ్ లోని రిటైర్డ్ ఉద్యోగుకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లో సవరణ ప్రతిపాదనలు చేసింది ప్రభుత్వం. 70 నుంచి 74 ఏళ్ళ పెన్షనర్లకు 7 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని, 75 నుంచి 79 ఏళ్ళ పెన్షనర్లకు 12 శాతం అదనపు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ప్రకటన చేశారు. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు సఫలమైనట్లు ఆయన వివరించారు. సమ్మె నోటీసులో పేర్కొన్న అన్ని అంశాల పై ప్రభుత్వం నుంచి స్పందన వచ్చిందని పేర్కొననున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. అలాగే.. సీసీఏను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. మార్చి 2022 నాటికి సీపీఎస్ రద్దు కు రోడ్ మ్యాప్ సిద్ధం చేయనుంది.
రిటైర్డ్ ఉద్యోగులకు 12 శాతం అదనపు పెన్షన్
February 06, 2022
0
Tags