పెట్రోల్, వేట కొడవళ్లతో దాడి!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరంలో భూవివాదంలో వైసిపి కార్యకర్తలపై బిజెపి నేతలు దాడి చేయడంతో ఇద్దరు మృతి చెందడం జరిగింది. శివప్ప, ఈరన్న వైసిపి కార్యకర్తలపై బిజెపి నేతలు పెట్రోల్, వేట కోడవళ్లతో దాడి చేశారు. ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడడంతో ఘటనా స్థలంలోనే చనిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఈ దాడిలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)