ఆంధ్రప్రదేశ్ లోని రేణిగుంట బుగ్గ వీధిలో రవిచంద్రన్ సూరి (53) ఆయన భార్య వసుంధర నివాసముంటున్నారు. ఆ ఇద్దరు దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. దీంతో ఇద్దరు తరుచు గొడవపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే గత రాత్రి దంపతుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పదునైన కత్తితో భర్త రవిచంద్రన్ గొంతు కోసి భార్య హతమార్చింది. మృతదేహం నుంచి తల, మొండెం వేరు చేసి వెళ్లిపోయింది. రక్తపుమడుగు పడి ఉన్న రవిచంద్రన్ను గమనించిన కుటుంబసభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. భర్తను హత్య చేసిన వసుంధరను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భర్తను హతమార్చిన భార్య!
January 20, 2022
0
Tags