31వరకు తెలంగాణలో కరోనా ఆంక్షలు పొడిగింపు

Telugu Lo Computer
0


ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఆంక్షలను పొడిగిస్తున్నట్టు గురువారం ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెలాఖరు వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. కరోనా కట్టడిలో భాగంగా నిబంధనలను కఠినతరం చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫీవర్ సర్వే అమలు చేసి జ్వర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి మెడికల్‌ కిట్లు పంపిణీ చేయనున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి హారీశ్ రావు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)