మనకెందుకు అని మౌనంగా ఉండాలా..?

Telugu Lo Computer
0


సినీ ఇండస్ట్రీకి పెద్ద అని అనిపించుకోవడం తనకు ఇబ్బంది అని, పెద్దరికం అనే హోదా తనకిష్టం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్న మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తాను పెద్దగా ఉండనని, కానీ బాధ్యతగల బిడ్డగా ఉంటానని చిరు చేసిన కామెంట్స్ పై ఇపుడు ఇండస్ట్రీ అంతా తెగ చర్చ నడుస్తోంది. కాగా ఈ నేపథ్యంలో నటుడు మోహన్ బాబు బహిరంగ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ‘మనకెందుకు..మనకెందుకు అని మౌనంగా ఉండాలా..నా మౌనం చేతకాని తనం కాదు..చేవలేని తనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయ్‌. కఠినంగా ఉంటాయ్.. కానీ నిజాలే ఉంటాయి. ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకు..? ఇది నీకు అవసరమా అన్నారు. అంటే వాళ్లు చెప్పినట్టు బతకాలా..? సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు నిర్మాతలు, నలుగురు డిస్ట్రిబ్యూటర్లు కాదు. కొన్ని వేల మంది ఆశలు. కొన్ని వేల కుటుంబాలు. కొన్ని వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట ఇది’ అన్నారు. ‘చిన్న సినిమాలు ఆడాలి, పెద్ద సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడాలంటే సరైన ధరలుండాలి. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలి. ఇండస్ట్రీకి దేవుళ్లయిన నిర్మాతలు ఇప్పుడెక్కడున్నారు. సినీ పరిశ్రమ ఏ ఒక్కరి గుత్తాదిపత్యం కాదు. అందరి జీవితాలతో ముడి పడి ఉన్న ఈ సినిమా ఇండస్ట్రీ గురించి, మనుకున్న సమస్యల గురించి సీఎంలకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమై సమస్యలు ఏంటి..పరిష్కారం ఏంటి..ఏది చేస్తే సినీ పరిశ్రమకు మనుగడ ఉంటుందని చర్చించుకోవాలని’ అంటూ మోహన్ బాబు సుదీర్ఘ సందేశంతో రాసిన లేఖ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మరి ఈ లేఖపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)