కత్తితో బెదిరించి అత్యాచారం

Telugu Lo Computer
0


మహిళను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని బాలానగర్‌కు చెందిన ఓ మహిళ (27) అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు. మహిళ భర్తకు పరిచయమైన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ జహంగీర్‌ తరచూ వారి ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఆమె భర్తను పోలీసులు గత ఏడాది ఆగస్టులో గంజాయి కేసులో అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన జహంగీర్‌ బెయిల్‌ ఇప్పిస్తానని ఆ మహిళను నమ్మించాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోగల ఓ లాడ్జికి ఆమెను తీసుకెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే కుమారుడిని చంపుతానన్నాడు. భయపడ్డ బాధితురాలు మౌనం వహించింది. ఇటీవల జహంగీర్‌ వేధిస్తుండడంతో బాలానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు కేసు బదిలీ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)