హైదరాబాద్ లోని జీడిమెట్ల గ్రామానికి చెందిన చంద్రమోహనేశ్వర్రెడ్డికి ఆయన కుమార్తె అమెరికా నుంచి ఫెడెక్స్ కొరియర్ ద్వారా కొన్ని పేపర్స్ పంపించింది. పేపర్లు ఇంకా తనకు చేరకపోవడంతో కొరియర్ సంస్థ కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో వెతికి ఓ నెంబర్కు ఫోన్ చేశాడు. ఫోన్ లిఫ్టు చేసిన గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మేరకు ఫోన్ పే ద్వారా ఒక రూపాయి పంపించాడు. దీంతో తన బ్యాంకు ఖాతా నుంచిరూ.99 వేలు డెబిట్ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన చంద్రమోహనేశ్వర్రెడ్డి పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
గూగుల్ పే లో రూపాయి పంపి... !
January 04, 2022
0