టాలీవుడ్ చిత్ర పరిశ్రమను కరోనా థర్డ్ వేవ్ కుదిపేస్తుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖ హీరోలు, నటులు కరోనా మహమ్మారి భారిన పడ్డారు. ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ నటుడు, పాత హీరో రాజేంద్ర ప్రసాద్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని ఎఐపీ ఆస్పత్రిలో చేర్పించారు. నిన్నటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు రాజేంద్ర ప్రసాద్ ను ఎఐపీ ఆస్పత్రికి తీసుకు వెళ్లారు ఆయన కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా పరీక్షలు చేస్తే పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
రాజేంద్ర ప్రసాద్ కు కరోనా
January 09, 2022
0
Tags