ఖుష్బూ కు కరోనా పాజిటివ్

Telugu Lo Computer
0


ప్రముఖ నటి, బీజేపీ నేత కుష్బూ కరోనా బారిన పడ్డారు. రెండు రోజుల నుంచి తీవ్ర అస్వస్థత కు లోనైన కుష్బూ తాజాగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షలో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ వేదికగా నటి కుష్బూ తెలియజేశారు. గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని కోరారు. కరోనా పట్ల అప్రమత్తత ఉంటే సరిపోతుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కుష్బూ తెలిపారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు చెప్పారు. కాగా ఇప్పటికే చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు, రాజేంద్ర ప్రసాద్, మంచు లక్ష్మి, హీరోయిన్ త్రిష, మంచు మనోజ్, బండ్ల గణేష్ లాంటి తదితరులు కరుణ బారిన పడ్డ సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)