జోగినిగా మారిన ట్రాన్స్‌జెండర్ !

Telugu Lo Computer
0


టిక్ టాక్ ఫేమ్ బంజారాహిల్స్ ప్రశాంత్ ట్రాన్స్ జెండర్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడామె జోగినిగా రూపాంతరం చెందింది. హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతం అల్లాపూర్ కు చెందిన ట్రాన్స్ జెండర్ గౌరారం ప్రశాంతి తల్లిదండ్రుల సమక్షంలో మంగళవారం నాడు కత్తితో వివాహమాడి జోగినిగా మారింది. ఆమె మెడలో గురువు మూడుముళ్లు వేశాడు. మామిడి, నేరేడు, వేప ఆకులతో వేసిన మండపంలో సంప్రదాయబద్దంగా జరిగిన జోగు వివాహానికి ప్రశాంతి కుటుంబీకులు, బంధువులు తదితరులు హాజరయ్యారు. తొలుత పండితుడి సూచనల మేరకు ప్రశాంతి తల్లిదండ్రులు అనంతలక్ష్మీ, నర్సింహులు 'ఎల్లమ్మ మునిరాజు జోగుకల్యాణం'గా పిలిచే వివాహ క్రతువు నిర్వహించారు. అనంతరం గురువు భూపేశ్ నగర్ జగన్ యాదవ్ (మేఘన), ప్రశాంతి మెడలో మూడు ముళ్లు వేశాడు. అంతకంటే ముందు ఉంగరాలు మార్చుకోవడం, తలపై జీలకర్ర-బెల్లం ఉంచడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ప్రశాంతిని జోగు కల్యాణం చేసుకున్న అనంతరం గురువు (మేఘన) ఆ పెళ్లికి హాజరైన మరికొంత మంది ట్రాన్స్ జెండర్ల మెడలలోనూ మూడు ముళ్లు వేశాడు. అమ్మవారి సేవలో జీవితాన్ని అంకితం చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు జోగినిగా మారిన వధువు ప్రశాంతి మీడియాకు తెలిపింది. వివాహ వేడుక అనంతరం బంధుమిత్రులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన ట్రాన్స్ జెండర్లు ప్రశాంతి వివాహానికి హాజరయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)