నేడు బీజేపీ క్యాండిల్ ర్యాలీ

Telugu Lo Computer
0


జీవో317కు నిరసనగా సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్షభగ్నంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్టు చేసినందుకు నిరసనగా మంగళవారం సాయంత్రం 5 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి జన జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ సహా పలువురిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బండి సంజయ్ ను అరెస్టు చేసిన తీరును నిరసిస్తూ ఈ రోజు సాయంత్రం క్యాండీ ర్యాలీని బీజేపీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు రానున్నారు. బండి సంజయ్ అరెస్టు, తదనంతర పరిణామాలను కమలనాథులు ఆయనకు వివరించనున్నారు. అనంతరం బీజేపీ శ్రేణులు నిర్వహించనున్న క్యాండిల్ ర్యాలీలో జేపీ నడ్డా పాల్గొననున్నారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడనున్నారు.హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వద్దనున్న బాబూ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి లిబర్టీలోని డా. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ నిరసన ర్యాలీని నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో బీజేపీ నిరసన ర్యాలీకి పోలీసులు అనుమతినిస్తారా? లేదా అనేదానిపై సందిగ్ధత నెలకొంది. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ర్యాలీ చేసి తీరుతామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెళ్లనున్నారు. జైల్లో ఉన్న రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో ములాఖత్ కానున్నట్టు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)