ఆంధ్రప్రదేశ్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో చలి తీవ్రత రోజురోజుకూ తగ్గుతోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి ఏపీలో గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయిని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాంలో నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతుండటంతో చలి ప్రభావం అంతగా కనిపించడం లేదని వాతావరణ కేంద్రం తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఇబ్బంది లేదని వాతావరణ కేంద్రం సూచించింది. విశాఖ, విజయనగరం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతు న్నాయి. కళింగపట్నంలో 16.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బాపట్లలో 17.5 డిగ్రీలు, నందిగామలో 17.2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తాంధ్రలో వాతావరణంలో ఏ మార్పులు లేవు. మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండనుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణం కాస్త వేడిగా మారింది. ఏపీలోని రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక్కడ సైతం ఎలాంటి వర్ష సూచన లేదు. ఆరోగ్యవరంలో కనిష్టంగా 17.5 డిగ్రీలు, కర్నూలులో 18.7 డిగ్రీలు, నంద్యాలలో 19.4 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
January 08, 2022
0
Tags