విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలలను యథావిధిగా నడపాలని ఆలోచిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతపై కూడా నిఘా ఉంచామన్నారాయన. కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ పాఠశాలలు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక సెలవుల పొడిగింపు ఆలోచన లేదన్న మంత్రి ఆదిమూలపు సురేష్ ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 15 నుంచి 18 ఏళ్ల వయసు విద్యార్థులకు కూడా వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు.
ఏపీలో స్కూళ్లకు సెలవులు పొడిగింపు లేదు !
January 16, 2022
0