కోడలిని చంపిన మామ!

Telugu Lo Computer
0


తెలంగాణ లోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సోమ్లా తండాకు చెందిన హచ్చా, రుక్కమ్మ దంపతులు. వారికి ముగ్గురు కుమారులు. పిల్లలకు వివాహమై వేరువేరుగా కాపురం ఉంటున్నారు. రెండో కుమారుడు తల్లిదండ్రులకు దగ్గర్లోనే అదే గ్రామంలో నివాసముంటున్నాడు. ఈ క్రమంలోనే హచ్చాకు రెండో కోడలికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి సంబంధం కొనసాగుతుండగా కోడలు మరొకరితో ప్రేమాయణం సాగించింది. దాంతో ఆమె తన మామను దూరం పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న హచ్చా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోడలి వద్దకు వెళ్లి కత్తితో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలున్నట్టు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)