ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చింతామణి నాటక ప్రదర్శనలపై నిషేధం విధించింది. వైశ్యులను కించపరించే విధంగా ఉన్న ఈ నాటక ప్రదర్శన లను నిషేధించాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చేసిన విజ్ఞప్తి చేసింది. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు రాష్ట్రంలో ఎక్కడా ఈ నాటక ప్రదర్శనలు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా ఈ చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు. తెలుగు నాటక రంగంలో చింతామణికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. 20వ శతాబ్దం మొదట్లో అప్పటి ప్రముఖ కవి కాళ్లకూరి నారాయణరావు రచించిన ఈ నాటకానికి ఇప్పటికీ మంచి ఆదరణ ఉంది. కాగా ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, సుబ్బిశెట్టి, శ్రీహరి, భవానీ శంకరం తదితర కీలక పాత్రలు ఉన్నాయి . అయితే నాటకంలోని సుబ్బిశెట్టి పాత్ర చింతామణి అనే స్త్రీ వ్యామోహంలో పడి ఆస్తిపాస్తులన్నీ పోగొట్టుకుంటాడు. ఈ క్రమంలోనే ఆ పాత్ర తమను కించపరిచేలా ఉందని ఆర్యవైశ్యులు ప్రభుత్వానికి విన్నవించారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఇకపై ఎక్కడా చింతామణి నాటకం ప్రదర్శించకుండా ఉత్తర్వులు జారీ చేసింది.
Post Top Ad
adg
Monday, 17 January 2022
Home
Andhraparadesh
ఆర్యవైశ్య మహాసభ చేసిన విజ్ఞప్తి
చింతామణి నాటక ప్రదర్శన నిషేధం
ప్రదర్శిస్తే కఠిన చర్యలు
ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం!
ఆంధ్రప్రదేశ్ లో చింతామణి నాటక ప్రదర్శన నిషేధం!
Tags
# Andhraparadesh
# ఆర్యవైశ్య మహాసభ చేసిన విజ్ఞప్తి
# చింతామణి నాటక ప్రదర్శన నిషేధం
# ప్రదర్శిస్తే కఠిన చర్యలు
About Telugu Post
ప్రదర్శిస్తే కఠిన చర్యలు
Tags
Andhraparadesh,
ఆర్యవైశ్య మహాసభ చేసిన విజ్ఞప్తి,
చింతామణి నాటక ప్రదర్శన నిషేధం,
ప్రదర్శిస్తే కఠిన చర్యలు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment