హతమైనది పాక్ ఉగ్రవాదే !

Telugu Lo Computer
0


కుప్వారా ఎన్‌కౌంటర్‌లో హతమైన ఉగ్రవాది. పాక్ కు చెందిన మహ్మద్‌ షబ్బీర్ మాలిక్ గా అధికారులు గుర్తించారు. స్పాట్ లో ఏకే-47 రైఫిల్, ఏడు గ్రెనేడ్‌ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో ఉగ్రవాదానికి పాల్పడుతున్నదనే దానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మరికొంత మంది చొరబాటుదారులు అక్కడే దాక్కున్నట్లు భారత ఆర్మీ భావిస్తోంది. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కొనసాగుతున్న కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ జనవరి 1న కుప్వారాలోని కేరాన్ సెక్టార్‌ లో చొరబాటుకు ప్రయత్నించాడు మాలిక్. వెంటనే అలర్ట్ అయిన మన సైనికులు అతడ్ని మట్టుబెట్టారు. మాలిక్ దగ్గర పాకిస్తాన్ గుర్తింపు కార్డు, వ్యాక్సినేషన్​ సర్టిఫికెట్లు దొరికాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)