11 ఏళ్ల తర్వాత బళ్లారికి గాలి జనార్థన్ రెడ్డి

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బళ్లారిలో గనుల వ్యాపారి గాలి జనార్ధన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. 11 ఏళ్ల తర్వాత బళ్లారిలో అడుగుపెట్టిన జనార్ధన్‌రెడ్డి దుర్గాదేవి ఆలయంలోప్రత్యేక పూజలు నిర్వహించారు. గనుల వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి 55వ జన్మదిన వేడుకలను బళ్లారిలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. 11 ఏళ్ల తర్వాత గాలిజనార్ధన్‌రెడ్డి బళ్లారి రావటంతో సంబరాల్లో ముంచెత్తారు. బళ్లారి దుర్గాదేవి ఆలయ ఆవరణలో 85 బంగారు , 55 వెండి నాణేలతో పాటు 5 రూపాయల నాణేలతో ఆయన తులాభారం ఇచ్చారు. ఈ తులాభారం తూచిన ధనాన్ని ఆలయానికి అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)