రోలెక్స్ వాచ్.... స్క్రీనింగ్ ప్రాసెస్... నో...!

Telugu Lo Computer
0


ఢిల్లీకి వెళ్లేందుకు బెంగూళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి ఓ ప్రయాణికుడు వచ్చాడు. బోర్డింగ్ పాస్ తీసుకున్న అనంతరం లగేజీ చెక్ చేసే ప్లేస్ కు వచ్చాడు. బ్యాగులతో పాటు..వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారనే సంగతి తెలిసిందే. తనిఖీ నిమిత్తం ధరించిన వాచ్ ను తీసి ట్రేల్ పెట్టాలని చెప్పారు సిబ్బంది. అయితే వాచ్ చాలా ఖరీదైందని, రొలెక్స్ వాచ్..దాదాపు రూ. 40 లక్షలు ఉంటుందని..ఇది తీయనని ఖరాఖండిగా చెప్పాడు. తీయాలని వారు, తీయనని ఆ ప్రయాణీకుడు. ఇలా కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్క్రీనింగ్ ప్రాసెస్ లో చోరికి గురైతే..ఏం చేస్తారని అతను ప్రశ్నించాడు. అలా ఏమీ జరగదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతోందని ఎంత చెప్పినా వినిపించుకోలేదని, చివరకు అతడిని పక్కను నిలబెట్టామన్నారు ఓ అధికారి. తనికీ ప్రక్రియ పూర్తయితేనే విమానం ఎక్కేందుకు అనుమతినిస్తాం, లేకపోతే లేదు అని చెప్పడంతో వాచ్ తీశాడన్నారు. స్ర్కీనింగ్ పూర్తి చేసిన అనంతరం లోనికి పంపించామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)