అనంతపురం జిల్లా పరిగి మండల కేంద్రంలోని పిహెచ్సికి ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ తన కుమారుడిని చికిత్స నిమిత్తం తీసుకువెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి శనివారం మృతి చెందాడు. చిన్నారి తండ్రి అశోక్ మాట్లాడుతూ... ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి ఇంజక్షన్ హైడోసు ఇవ్వడంవల్లే మృతి చెందాడని ఆవేదన చెందాడు.