రైల్వే ట్రాక్పై రైలు కాకుండా మరే ఇతర వాహనమైనా వెళ్తే అది ఎలా వెళ్తుందో అంటూ అందరూ ఆశ్చర్యంగా గమనిస్తారు. సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లి వద్ద రైల్వే ట్రాక్పై ఓ ఎక్స్కవేటర్ రయ్ రయ్ మంటూ వెళ్లడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక్కడ రైల్వే డబుల్ ట్రాక్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రైలు పట్టాలను తరలించేందుకు ఎక్సాకవేటర్ ఆపరేటర్ ఎంతోచాకచక్యంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఈ ట్రాక్ పక్కనే హిందూపురం-సోమందేపల్లి రహదారి కూడా ఉండటంతో వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు ఎక్స్కవేటర్ ట్రాక్పై ఎలా వెళ్తుందోనని ఆసక్తిగా గమనించారు.
పట్టాలెక్కిన ఎక్స్కవేటర్!
December 26, 2021
0