దుబాయ్‌లో నమ్రతకు ఉపాసన విందు !

Telugu Lo Computer
0


మహేశ్‌బాబు సతీమణి నమ్రత, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. మహేశ్‌ నివాసంలో జరిగే వేడుకలకు రామ్‌చరణ్‌ - ఉపాసన హాజరవుతుంటారు. ప్రస్తుతం ఈ హీరోలిద్దరూ తమ తదుపరి ప్రాజెక్ట్‌లలో బిజీగా ఉండగా, వాళ్ల సతీమణులు దుబాయ్‌లో సందడి చేశారు. 'దుబాయ్‌ ఎక్స్‌పో 2020'లో భాగంగా అక్కడికి వెళ్లిన వీళ్లు క్రిస్మస్‌ సెలబ్రేషన్స్‌ జరుపుకొన్నారు. నమ్రత, ఆమె సోదరి శిల్పా, మనీశ్‌ మల్హోత్ర తదితరులకు ఉపాసన ప్రత్యేకంగా విందు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ''ఇష్టమైన స్నేహితులతో రుచికరమైన భోజనం. నాకెంతో ఇష్టమైనవారితో దుబాయ్‌లో ఈ మధ్యాహ్నం సరదాగా గడిచింది. ఉపాసన, అద్భుతమైన వంటకాలతో నీలా విందు ఎవ్వరూ ఇవ్వలేరు. మనీశ్‌ ఈరోజు నిన్ను ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుకలే త్వరలో హైదరాబాద్‌లో మనందరం కలిసి జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అందరికీ హ్యాపీ క్రిస్మస్‌'' అని నమ్రత పోస్ట్‌ పెట్టగా.. ''సమయం ఎంతో సరదాగా గడిచిపోయింది. అతిత్వరలోనే మనం మళ్లీ హైదరాబాద్‌లో ఇలాగే కలుసుకోవాలి'' అని ఉప్సీ రిప్లై ఇచ్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)