ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ కు చెందిన మోషిన్‌ అనే యువకుడు పెళ్లైన మహిళతో కొన్నేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ భర్తను కూడా వదిలేసి మోషిన్ తో కలిసి ఉంటోంది. రెండేండ్ల నుంచి  నైనిటాల్ ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈ విషయం భర్తకు తెలియడంతో అక్కడి నుంచి జైపూర్ కి మకాం మార్చారు. భర్త అక్కడికి కూడా వెళ్లాడు. ప్రియురాలి భర్త నుంచి తప్పించుకునే క్రమంలో యువకుడు ఐదో అంతస్తు నుంచి దూకేశాడు. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మోషిన్ ను సదరు మహిళ ఎస్ఎంఎస్ ప్రభుత్వ దవాఖానాకు తరలించింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు కారణమైన మహిళ ప్రస్తుతం పరారీలో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యభర్తల కోసం గాలిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)